కువైట్లో మృతి చెందిన శ్రీను కుటుంబానికి APNRTS అండ.. మృతదేహం స్వదేశానికి తరలింపులో వేగవంతమైన సమన్వయం
కువైట్లో మృతి చెందిన తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం ప్రాంతానికి చెందిన శ్రీ ముమ్మిడివరపు శ్రీను గారి మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు APNRTS వేగవంతమైన చర్యలు చేపట్టింది. భారత రాయబార కార్యాలయం, ప్రవాస ప్రతినిధులు, వివిధ వర్గాల సమన్వయంతో కుటుంబానికి అవసరమైన సహాయం అందించారు. ప్రవాసాంధ్రుల సంక్షేమానికి APNRTS ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మరోసారి నిరూపించింది.
కువైట్లో మృతి చెందిన ముమ్మిడివరపు శ్రీను కుటుంబానికి అండగా APNRTS – స్వదేశానికి మృతదేహం తరలింపులో వేగవంతమైన సమన్వయం
కువైట్లో ఉద్యోగం చేస్తున్న తూర్పు గోదావరి జిల్లా, ముమ్మిడివరం ప్రాంతానికి చెందిన శ్రీ ముమ్మిడివరపు శ్రీను గారు ఆకస్మికంగా మృతి చెందిన వార్త తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ క్లిష్ట సమయంలో మృతుని కుటుంబానికి అండగా నిలుస్తూ, మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అవసరమైన అన్ని చర్యలను APNRTS సమన్వయంతో వేగవంతంగా చేపట్టింది.
కువైట్లోని భారత రాయబార కార్యాలయంతో నిరంతర సమన్వయం కొనసాగిస్తూ, APNRTS రీజినల్ కోఆర్డినేటర్లు శ్రీ ముస్తాక్ ఖాన్ గారు, శ్రీ దివాకర్ నాయుడు ఓలేటి గారు, NRI TDP సెంట్రల్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ రాచూరి మోహన్ గారు, NRI TDP సీనియర్ నాయకులు శ్రీ మురళి దుగ్గినేని గారు, NRT కోఆర్డినేటర్లు శ్రీ దొడ్డిపల్లి సుబ్బరాజు గారు మరియు శ్రీ దౌర్ల సాయిబాబా గారు అవసరమైన సహాయక చర్యలను సమన్వయం చేస్తూ కుటుంబానికి అండగా నిలిచారు.
ప్రవాసాంధ్రుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మంత్రి శ్రీ నారా లోకేష్ గారు మరియు NRI వ్యవహారాల మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వంలో APNRTS ద్వారా అందిస్తున్న సేవలు మరోసారి ప్రవాస కుటుంబాలకు భరోసాను కల్పించాయి.
ఈ సందర్భంగా APNRTS అధ్యక్షులు డాక్టర్ రవి కుమార్ వేమూరు గారు, గల్ఫ్ మరియు ఫార్ ఈస్ట్ దేశాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి శ్రీ రావి రాధాకృష్ణ గారు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన మార్గదర్శకత్వం అందించారు.
అదేవిధంగా, ఈ మొత్తం ప్రక్రియలో వివిధ వర్గాల మధ్య సమన్వయం కల్పిస్తూ, అవసరమైన సూచనలు మరియు సలహాలు అందించి సహాయక చర్యలను వేగవంతం చేయడంలో APNRTS డైరెక్టర్ (ఆపరేషన్స్ & సర్వీసెస్) శ్రీ నాగేంద్ర బాబు అక్కిలి గారు కీలక పాత్ర పోషించారు.
శ్రీ ముమ్మిడివరపు శ్రీను గారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ తీరని లోటును భరించే మనోధైర్యం, శక్తిని భగవంతుడు ప్రసాదించాలని APNRTS తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము.





