09 Aug 2026, Sunday
విహారి

సౌత్ కోస్ట్ రైల్వే రికార్డు.. రూ.2,493 కోట్ల ఆదాయం

By PRAJA NADU Desk 07 Aug 2026, 02:05 PM Updated: 09 Aug 2026, 12:29 PM 7 views
సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ (SCoR) తక్కువ సమయంలోనే గణనీయమైన పురోగతి సాధించిందని కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది. వార్షికంగా రూ.2,493 కోట్ల ఆదాయంతో దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన జోన్‌గా నిలిచిందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి భారీ స్థాయిలో పనులు కొనసాగుతున్నాయని కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం రూ.54,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు అమల్లో ఉండగా, మరో రూ.71,000 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించింది. విశాఖపట్నం రైల్వే యార్డ్ ఆధునికీకరణ కోసం రూ.300 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. పునర్నిర్మాణంలో భాగంగా ఆరు కొత్త ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులోకి రానున్నాయని పేర్కొంది. గుంతకల్‌-బళ్లారి నాలుగు లైన్ల విస్తరణకు రూ.1,205 కోట్లు కేటాయించినట్లు కేంద్రం తెలిపింది. రైళ్ల భద్రత కోసం 100 ఇంజిన్లలో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.
విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ (SCoR) తక్కువ కాలంలోనే గణనీయమైన పురోగతి సాధించిందని కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది. వార్షికంగా రూ.2,493 కోట్ల ఆదాయంతో దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన జోన్‌గా నిలిచిందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే అభివృద్ధికి భారీ స్థాయిలో పనులు కొనసాగుతున్నాయని కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం రూ.54,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు అమల్లో ఉండగా, మరో రూ.71,000 కోట్ల విలువైన పనులు పైప్‌లైన్‌లో ఉన్నాయని వెల్లడించింది. విశాఖపట్నం రైల్వే యార్డ్ ఆధునికీకరణకు రూ.300 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. ఆరు కొత్త ప్లాట్‌ఫారమ్‌ల ఏర్పాటు పనులు చేపడుతున్నట్లు వెల్లడించింది. గుంతకల్‌-బళ్లారి నాలుగు లైన్ల విస్తరణకు రూ.1,205 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. రైళ్ల భద్రత కోసం కవచ్ వ్యవస్థను విస్తరిస్తున్నట్లు, 100 ఇంజిన్లలో ఈ సాంకేతికతను ఏర్పాటు చేసినట్లు కేంద్రం పేర్కొంది. తిరుపతి రైల్వే స్టేషన్‌లో భక్తుల రద్దీ నియంత్రణకు రూ.20 కోట్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు కేంద్రం తెలిపింది. అలాగే రాయనపాడు, మంగళగిరి సహా 70కిపైగా స్టేషన్లలో అమృత్ భారత్ పథకం కింద ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించింది. విజయవాడ రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్‌, విశాఖపట్నం స్టేషన్‌లో డెక్కన్ ఛాయ్ వంటి ఆధునిక సదుపాయాలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల సేవలపై ముందస్తు సమీక్షలు పూర్తి చేసినట్లు కేంద్రం తెలిపింది. ఏపీలో రైల్వే నెట్‌వర్క్‌ విస్తరణ, భద్రతా ప్రమాణాల పెంపు, ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి కొనసాగుతుందని వెల్లడించింది.

Related Stories