కువైట్లో APNRTS నూతన కోఆర్డినేటర్లకు ఘన సన్మానం
కువైట్లో APNRTS నూతన కోఆర్డినేటర్ల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గల్ఫ్ రీజినల్ కోఆర్డినేటర్ కంచన శ్రీకాంత్, గల్ఫ్ జనసేన నాయకులు అంజన్ కుమార్, ఆకుల రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన కోఆర్డినేటర్లను అభినందించారు.
ఈ సందర్భంగా కంచన శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం APNRTS అందిస్తున్న సేవలను ప్రతి తెలుగు కుటుంబానికి చేరువ చేయాలని కోరారు. సభ్యత్వ విస్తరణతో పాటు అత్యవసర పరిస్థితుల్లో అందించే సహాయ కార్యక్రమాలపై ప్రవాసులకు అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకంపై కూడా సమావేశంలో చర్చించారు. గల్ఫ్ దేశాల్లోని తెలుగు ప్రవాస కుటుంబాలకు ఈ పథకం ప్రయోజనాలను వివరించాలని నిర్ణయించారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా గల్ఫ్లోని ఆరు దేశాల్లో 5,000 మంది ప్రవాసాంధ్రులకు ఉచిత బీమా సభ్యత్వాలు కల్పించే లక్ష్యాన్ని ప్రకటించారు.
కువైట్లో APNRTS నూతన కోఆర్డినేటర్ల అభినందన, సన్మాన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఏపీఎన్ఆర్టీఎస్ గల్ఫ్ రీజినల్ కోఆర్డినేటర్ కంచన శ్రీకాంత్, గల్ఫ్ జనసేన నాయకులు అంజన్ కుమార్, ఆకుల రాజేష్ మరియు జనసేన నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కోఆర్డినేటర్లను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గల్ఫ్ రీజినల్ కో ఆర్డినేటర్ శ్రీ కంచన శ్రీకాంత్ మాట్లాడుతూ, ఏపీఎన్ఆర్టీఎస్ కోఆర్డినేటర్లుగా బాధ్యతలు చేపట్టిన ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తి నిబద్ధతతో నిర్వర్తించాలని సూచించారు. ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం పనిచేసే అవకాశం కల్పించిన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారికి ,APNRTS చైర్మన్ శ్రీ రవి వేమూరి గారికి,MLC శ్రీ నాగబాబు గారికి,జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తల్లూరి గారికి,గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్ శ్రీ కేసరి త్రిమూర్తులు గారికి అలాగే జనసేన పార్టీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
కువైట్లో నివసిస్తున్న తెలుగు ప్రవాసులందరికీ ఏపీఎన్ఆర్టీఎస్ అందిస్తున్న సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, సంస్థ సభ్యత్వాన్ని విస్తృతంగా పెంచేందుకు ప్రతి కోఆర్డినేటర్ కృషి చేయాలని ఆయన కోరారు. ప్రవాసాంధ్రులకు అవసరమైన సేవలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అత్యవసర పరిస్థితుల్లో అందించే సహాయ సహకారాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రవాసాంధ్ర భరోసా భీమాపై ప్రత్యేక దృష్టి
సమావేశంలో ప్రవాసాంధ్ర భరోసా భీమా పథకంపై ప్రత్యేకంగా చర్చించారు. విదేశాల్లో పనిచేస్తున్న ప్రవాస కార్మికులకు, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో భీమా ప్రాధాన్యతను వివరించారు. కువైట్లోని ప్రతి తెలుగు ప్రవాస కుటుంబానికి ఈ భీమా ప్రయోజనాలను వివరించి, అర్హులైన ప్రతి ఒక్కరూ సభ్యత్వం పొందేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.
గౌరవ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా 5,000 మందికి ఉచిత భీమా
రాబోయే గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గల్ఫ్లోని ఆరు దేశాల్లో సమన్వయంతో 5,000 మంది ప్రవాసాంధ్రులకు ఉచిత ప్రవాసాంధ్ర భరోసా భీమా సభ్యత్వాలు కల్పించే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.
గల్ఫ్ దేశాల్లోని తెలుగు ప్రవాసుల సంక్షేమం కోసం ఐక్యంగా పనిచేస్తూ, సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
నూతన కోఆర్డినేటర్లకు సన్మానం
ఈ కార్యక్రమంలో నూతనంగా ఏపీఎన్ఆర్టీఎస్ కోఆర్డినేటర్లుగా బాధ్యతలు స్వీకరించిన కుంచా నగేష్, జోగినేని నాగేంద్రబాబు, కొమ్మినేని బాలాజీ,సానబోయిన పనీంద్ర, చింతల వెంకటేష్, అప్పిన చిరంజీవి, గుంటూరు శంకర్, గిడుగు రాంబాబులను ఘనంగా సన్మానించి కోలా శ్రీకాంత్, గ్రందే ప్రసాద్ మరియు సిశెట్టి మల్లికార్జున కి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గల్ఫ్ జనసేన నాయకులు అంజన్ కుమార్, ఆకుల రాజేష్,ఇమ్మిడిశెట్టి సూర్య, జగిలి ఓబులేష్, షేక్ అలీ, గంగారపు చంద్రశేఖర్,రెడ్డిచర్ల ఆంజనేయులు,నల్లం శెట్టి కిషోర్,కుంచ శివ తదితరులు పాల్గొన్నారు.
ఏపీఎన్ఆర్టీఎస్ సభ్యత్వ నమోదు, ప్రవాసాంధ్ర భరోసా భీమా విస్తరణ కార్యక్రమాలకు గల్ఫ్ జనసేన నాయకులు తమ సంపూర్ణ సహకారం అందిస్తారని ఈ సందర్భంగా తెలిపారు. ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం ఏపీఎన్ఆర్టీఎస్ మరియు జనసేన నాయకత్వం సమన్వయంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.





