చంద్రబాబు కాన్వాయ్పై రాళ్ల దాడి కుట్రే.. సుప్రీంకోర్టులో లూథ్రా వాదనలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2022లో నందిగామలో ఆయన కాన్వాయ్పై జరిగిన రాళ్ల దాడి ఘటనపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి.ఈ దాడి సాధారణ ఘటన కాదని, చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని జరిగిన కుట్రగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా తెలిపారు.2022లో నందిగామలో చంద్రబాబు కాన్వాయ్పై జరిగిన రాళ్ల దాడి ఉద్దేశపూర్వక కుట్రగా భావించాల్సి ఉందని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సుప్రీంకోర్టులో తెలిపారు.
2022లో ఆంధ్రప్రదేశ్లోని నందిగామలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్పై జరిగిన రాళ్ల దాడి కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా.. ఈ ఘటన సాధారణమైనది కాదని, చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా జరిగిన కుట్రగా పేర్కొన్నారు.ఈ దాడిలో చంద్రబాబు భద్రతా సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డారని లూథ్రా కోర్టుకు తెలిపారు.కేసులో లోతైన దర్యాప్తు జరిగితేనే అసలు వాస్తవాలు, ఘటన వెనుక ఉన్న వ్యక్తులు, శక్తులు బయటపడతాయని పేర్కొన్నారు.నిందితులను కస్టడీలోకి తీసుకోవడం ద్వారా విచారణ మరింత పారదర్శకంగా సాగుతుందని వాదించారు.నందిగామ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసులో నిందితులు కన్నెగంటి సజ్జనరావు, మరో వ్యక్తి అరెస్టు నుంచి రక్షణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది.
విచారణ సందర్భంగా నిందితులను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.అయితే దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. బెయిల్కు సంబంధించిన షరతులను నిర్ణయించే బాధ్యతను కింది కోర్టుకే అప్పగించింది.నిందితుల తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. కేసులో ఇప్పటివరకు పలువురు దర్యాప్తు అధికారులు మారినా పురోగతి కనిపించలేదని తెలిపారు.
ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయ కక్షతో చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు.మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆరోపణలు తీవ్రమైనవని, కుట్ర కోణంలో దర్యాప్తు కొనసాగాల్సిన అవసరం ఉందని కోర్టుకు వివరించింది.





