24 Aug 2026, Monday

3 రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా.. ‘ఇరుముడి’ బాక్సాఫీస్ ర్యాంపేజ్!

By PRAJA NADU Desk 24 Aug 2026, 02:53 PM Updated: 24 Aug 2026, 04:09 PM 2 views
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ హౌస్‌ఫుల్ షోలతో సత్తా చాటుతోంది. కుటుంబ ప్రేక్షకులు, అయ్యప్ప భక్తుల ఆదరణతో సినిమాకు భారీ స్పందన లభిస్తోంది. ఓవర్సీస్‌లోనూ మిలియన్ మార్క్‌ను అందుకున్నట్లు చిత్రబృందం తెలిపింది.
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో వసూళ్లు క్రమంగా పెరిగాయి. వీకెండ్ ముగిసే సమయానికి ‘ఇరుముడి’ ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఎలాంటి టికెట్ ధరల పెంపు లేకుండా సాధారణ సీజన్‌లో విడుదలైన ప్రాంతీయ సినిమాగా వేగంగా రూ.80 కోట్ల మార్క్‌ను అందుకున్న చిత్రంగా రికార్డు సృష్టించినట్లు మేకర్స్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. కుటుంబ ప్రేక్షకులతో పాటు అయ్యప్ప భక్తులు కూడా సినిమాను చూసేందుకు థియేటర్లకు వస్తున్నారని చిత్రబృందం తెలిపింది. పలుచోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఓవర్సీస్‌లో ఈ సినిమా 1 మిలియన్ మార్క్‌ను అందుకున్నట్లు సమాచారం. తండ్రీకూతుళ్ల అనుబంధం, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని చిత్రబృందం పేర్కొంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, ప్రియా భవానీ శంకర్, పాప నక్షత్ర నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నట్లు తెలిపింది. ఇదే జోరు కొనసాగితే సినిమా త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related Stories