విద్యార్థినులపై కొందరు టీచర్ల వక్రబుద్ధి.. అనంతపురంలో వరుస ఘటనలతో కలవరం
అనంతపురం: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు జిల్లాలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల అనంతపురం జిల్లాలోని పలు పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడంతో విద్యాశాఖలో కలకలం రేగింది.పెద్దపప్పూరు మండలం చీమలవాగుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడిపై విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేశారు. యల్లనూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో కూడా విద్యార్థులను వేధిస్తున్నారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, విచారణ అనంతరం సంబంధిత టీచర్పై చర్యలు తీసుకున్నారు
అనంతపురం: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు జిల్లాలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల అనంతపురం జిల్లాలోని పలు పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడంతో విద్యాశాఖలో కలకలం రేగింది.
పెద్దపప్పూరు మండలం చీమలవాగుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడిపై విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేశారు. యల్లనూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో కూడా విద్యార్థులను వేధిస్తున్నారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, విచారణ అనంతరం సంబంధిత టీచర్పై చర్యలు తీసుకున్నారు.
పామిడి మండలం అప్పాజీపేట ప్రాథమిక పాఠశాలలో ఓ ఎస్జీ టీచర్ మధ్యాహ్న భోజన వంట ఏజెన్సీ మహిళతో అసభ్యంగా వ్యవహరించారని ఫిర్యాదు రావడంతో అతడిని సస్పెండ్ చేసినట్లు కథనం పేర్కొంది. తాజాగా కళ్యాణదుర్గం నార్త్ స్కూల్లో విద్యార్థినితో టీచర్ అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలు రావడంతో తల్లిదండ్రులు పోలీసులకు అప్పగించినట్లు తెలిపింది.
గార్లదిన్నె ఏపీ మోడల్ స్కూల్లో కూడా ఓ టీచర్ ఇంటర్ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనతో విద్యార్థిని భయపడి చదువు మానేయాలని భావించినట్లు కథనం పేర్కొంది. అనంతరం ఆ టీచర్ను సస్పెండ్ చేశారు.
వరుస ఘటనల నేపథ్యంలో పాఠశాలల్లో పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు లేకపోవడం వంటి అంశాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అనంతపురం జిల్లా డీఈవో అయూబ్ హుస్సేన్ మాట్లాడుతూ, ఒకరిద్దరి వల్ల మొత్తం ఉపాధ్యాయ వ్యవస్థకు చెడ్డపేరు వస్తోందన్నారు. ఘటనలు జరిగిన వెంటనే చర్యలు తీసుకుంటున్నామని, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకు కాంప్లెక్స్ సమావేశాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు





