హాకీ ప్రపంచకప్లో సంచలన మార్పులు.. ఇక క్వార్టర్ ఫైనల్స్ ఉండవు
నెదర్లాండ్స్, బెల్జియం వేదికలుగా జరగనున్న హాకీ వరల్డ్కప్లో కొత్త ఫార్మాట్ అమల్లోకి వచ్చింది.16 జట్లతో జరిగే ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్ స్థానంలో క్రాస్ ఓవర్ రౌండ్ను నిర్వహించనున్నారు. భారత్ గ్రూప్-డిలో ఇంగ్లండ్, పాకిస్థాన్, వేల్స్తో పోటీపడనుంది.హాకీ వరల్డ్కప్లో ఈసారి భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. సంప్రదాయ క్వార్టర్ ఫైనల్స్ను తొలగించి కొత్త క్రాస్ ఓవర్ ఫార్మాట్ను ప్రవేశపెట్టారు.
ప్రతిష్టాత్మక హాకీ వరల్డ్కప్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. 51 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు ముగింపు పలకాలని భావిస్తున్న భారత పురుషుల జట్టు ఈ మెగా టోర్నీకి సిద్ధమవుతోంది.
అయితే ఈసారి హాకీ ప్రపంచకప్లో ఫార్మాట్లో కీలక మార్పులు చేశారు. గత టోర్నీల్లో ఉన్న సంప్రదాయ క్వార్టర్ ఫైనల్స్ విధానాన్ని తొలగించి కొత్త విధానాన్ని తీసుకొచ్చారు.
టోర్నీలో పాల్గొనే 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు.
ప్రతి గ్రూప్లో నాలుగు జట్లు ఉంటాయి.
గ్రూప్-A
గ్రూప్-B
గ్రూప్-C
గ్రూప్-D
భారత్ గ్రూప్-Dలో ఇంగ్లండ్, పాకిస్థాన్, వేల్స్తో కలిసి ఉంది.
ప్రతి గ్రూప్లో టాప్-2లో నిలిచిన జట్లు తర్వాతి దశకు అర్హత సాధిస్తాయి.
తేదీలు: ఆగస్టు 21 నుంచి 24 వరకు
క్వార్టర్ ఫైనల్స్కు బదులుగా క్రాస్ ఓవర్ రౌండ్ను నిర్వహిస్తారు.ఈ దశలో జట్లను కొత్తగా నాలుగు గ్రూపులుగా విభజిస్తారు.
గ్రూప్ A, గ్రూప్ Dలో టాప్-2లో నిలిచిన జట్లు
గ్రూప్ B, గ్రూప్ Cలో టాప్-2లో నిలిచిన జట్లు
గ్రూప్ A, గ్రూప్ Dలో 3, 4 స్థానాల్లో ఉన్న జట్లు
గ్రూప్ B, గ్రూప్ Cలో 3, 4 స్థానాల్లో ఉన్న జట్లు
క్రాస్ ఓవర్ రౌండ్లో కొత్తగా ఎదురయ్యే ప్రత్యర్థులతో మ్యాచ్లు ఆడతారు.
అయితే తొలి దశలో తమతో పాటు ముందుకు వచ్చిన జట్టుపై సాధించిన ఫలితాల పాయింట్లు కూడా కొనసాగుతాయి.
ఉదాహరణకు.. భారత్ గ్రూప్ దశలో ఇంగ్లండ్పై విజయం సాధించి, ఇరు జట్లు రెండో దశకు చేరితే ఆ విజయానికి సంబంధించిన పాయింట్లు భారత్కు కొనసాగుతాయి.
తేదీలు: ఆగస్టు 27-28
పూల్-E, పూల్-Fలో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్కు చేరుకుంటాయి.
మిగిలిన జట్లు 5 నుంచి 16 స్థానాల కోసం క్లాసిఫికేషన్ మ్యాచ్లు ఆడతాయి.
పూల్-E టాపర్ vs పూల్-F రెండో స్థానం
పూల్-F టాపర్ vs పూల్-E రెండో స్థానం





