అమిత్ షాపై కేసు వేస్తానన్న మమత.. బెంగాల్ ఎన్నికల్లో మాటల యుద్ధం ముదిరింది
తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కేసు పెడతానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.
ఎన్నికల ర్యాలీలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మమతా బెనర్జీ మండిపడ్డారు. అవసరమైతే చట్టపరమైన పోరాటానికి సిద్ధంగా ఉన్నానని హెచ్చరించారు. ఇది బెంగాల్ రాజకీయాల్లో కొత్త వేడిని తీసుకొచ్చింది.