తెలంగాణ మెడికల్ కాలేజీల్లో పాత ఫీజులే.. 2026-29కు ఫీజుల ఖరారు
తెలంగాణలో MBBS, BDS ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది.
కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ 2026-29 బ్లాక్ పీరియడ్కు సంబంధించి మెడికల్, డెంటల్ కాలేజీల ఫీజులను ప్రకటించింది.
గత బ్లాక్ పీరియడ్లో అమల్లో ఉన్న ఫీజులనే మరో నాలుగేళ్లు కొనసాగించాలని నిర్ణయించింది.
MBBS కన్వీనర్ కోటాకు ఏడాదికి రూ.60 వేల ఫీజు కొనసాగనుండగా, మేనేజ్మెంట్ కోటా కింద రూ.11.55 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు ఫీజు ఉంటుంది.
BDS కోర్సులో కన్వీనర్ కోటా ఫీజు రూ.45 వేలు, మేనేజ్మెంట్ కోటా ఫీజు రూ.4.20 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుంది.
తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది.2026-29 బ్లాక్ పీరియడ్కు సంబంధించి MBBS, BDS కోర్సుల ఫీజులను ఖరారు చేస్తూ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది.ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.98 ప్రకారం.. 2023-26 కాలానికి అమల్లో ఉన్న ఫీజులనే మరో నాలుగేళ్ల పాటు కొనసాగించాలని నిర్ణయించారు.ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా (కేటగిరీ-A) కింద MBBS కోర్సుకు ఏడాదికి రూ.60 వేల ఫీజును కొనసాగించారు.మేనేజ్మెంట్ కోటా (కేటగిరీ-B) కింద కాలేజీలను బట్టి రూ.11.55 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు ఫీజు ఉంటుంది.అపోలో, చల్మెడ, కామినేని నార్కెట్పల్లి, కామినేని హైదరాబాద్, మల్లారెడ్డి, MNR మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ ఫీజు రూ.13 లక్షలుగా నిర్ణయించారు.
డెంటల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద ఏడాదికి రూ.45 వేలు, మేనేజ్మెంట్ కోటాలో రూ.4.20 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఫీజులు ఉంటాయి.NRI కోటా కింద మేనేజ్మెంట్ కోటా ఫీజుకు గరిష్ఠంగా రెండు రెట్ల వరకు వసూలు చేసుకునే అవకాశం కల్పించారు.
విద్యార్థుల నుంచి క్యాపిటేషన్ ఫీజు, డొనేషన్ల పేరుతో అదనపు మొత్తాలు వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కోర్సు మొత్తం ఫీజును ఐదు విడతల్లో చెల్లించే అవకాశం కల్పించారు. ఒకసారి చేరిన విద్యార్థికి కోర్సు పూర్తయ్యే వరకు అదే ఫీజు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.





