19 Jul 2026, Sunday
NRI

ఎన్ఆర్ఐ టీడీపీ కేంద్ర కమిటీ సెక్రటరీ వంకా రమణమ్మకు ఘన సత్కారం

By PRAJA NADU Desk 18 Jul 2026, 12:17 PM Updated: 18 Jul 2026, 11:44 PM 121 views
ఎన్ఆర్ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ సెక్రటరీగా నియమితులైన వంకా రమణమ్మను ఒమాన్‌ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. గతంలో ఒమాన్‌ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆమె పార్టీ విస్తరణ, ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారం, మహిళలు–యువతను కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడంలో కృషి చేశారని నాయకులు తెలిపారు. తాను సాధారణ కార్యకర్తగా ప్రారంభించి కేంద్ర కమిటీ బాధ్యత పొందడం సంతోషంగా ఉందని రమణమ్మ పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించి అవకాశాలు ఇవ్వడం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత అని ఆమె అన్నారు. ఒమాన్‌ మహానాడు నిర్వహణలో కూడా రమణమ్మ నాయకత్వం వహించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
కష్టపడిన కార్యకర్తలకు గౌరవం... బడుగు వర్గాలకు కీలక పదవులు... ఇదే తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత ఎన్ఆర్ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ సెక్రటరీగా శ్రీమతి వంకా రమణమ్మ గారికి బాధ్యతలు దక్కిన సందర్భంగా, గతంలో ఎన్ఆర్ఐ టీడీపీ ఒమాన్ ప్రధాన కార్యదర్శిగా ఆమె అందించిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ ఒమాన్ తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన అభినందన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సభలో మాట్లాడిన పార్టీ నాయకులు, శ్రీమతి వంకా రమణమ్మ గారు పార్టీ పట్ల చూపిన అంకితభావం, క్రమశిక్షణ, సమర్థ నాయకత్వం, సేవా దృక్పథం మరియు ప్రవాస తెలుగు దేశం పార్టీ బలోపేతానికి చేసిన విశేష కృషి వల్లే ఈ గౌరవప్రదమైన బాధ్యతలు లభించాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీమతి వంకా రమణమ్మ గారు, తాను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సాధారణ కార్యకర్తనని, ఎన్ఆర్ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ సెక్రటరీ వంటి గౌరవప్రదమైన బాధ్యత తనకు లభించడం ఊహించని విషయమని భావోద్వేగానికి గురయ్యారు. కులం, వర్గం, ఆర్థిక పరిస్థితులను పక్కనపెట్టి కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించి అవకాశాలు కల్పించడం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత అని అన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి, APNRTS అధ్యక్షులు డా. రవి వేమూరు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి శ్రీ రాధాకృష్ణ రావి గారికి, NRT డైరెక్టర్ నాగేంద్రబాబు అక్కిలి గారికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఒమాన్‌లో తెలుగు దేశం పార్టీ కార్యకలాపాలను గ్రామ స్థాయి కార్యకర్త నుంచి అంతర్జాతీయ స్థాయి నాయకత్వం వరకు అనుసంధానం చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారని నాయకులు కొనియాడారు. ప్రవాసాంధ్రులను పార్టీ సిద్ధాంతాలకు మరింత చేరువ చేయడం, మహిళలను రాజకీయంగా చైతన్యవంతులను చేయడం, యువతను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడంలో ఆమె చేసిన కృషి విశేషమని పేర్కొన్నారు. ఎలాంటి పదవులను ఆశించకుండా పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ, కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకురాలిగా వంకా రమణమ్మ గారు ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ఆమె చూపిన సమన్వయ సామర్థ్యం, నాయకత్వ నైపుణ్యం, సేవాభావం అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారంలోనూ, సంక్షేమ కార్యక్రమాల అమలులోనూ, పార్టీ విస్తరణలోనూ ఆమె చేసిన సేవలు ఎన్ఆర్ఐ టీడీపీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని నాయకులు అభిప్రాయపడ్డారు. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన ఆమెకు సెంట్రల్ కమిటీ సెక్రటరీ బాధ్యతలు రావడం కష్టానికి లభించిన సముచిత గౌరవమని పేర్కొన్నారు. ఎన్ఆర్ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ సెక్రటరీగా శ్రీమతి వంకా రమణమ్మ గారు మరింత సమర్థవంతంగా సేవలందిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలుగు దేశం పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకువస్తారని, సంస్థను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చుతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వంకా రమణమ్మ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఆమె నాయకత్వంలో ఎన్ఆర్ఐ టీడీపీ ప్రపంచవ్యాప్తంగా మరింత బలోపేతం కావాలని, ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం ఆమె సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.

Related Stories