14 Sep 2026, Monday
జిల్లా వార్తలు

తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు

By PRAJA NADU Desk 14 Sep 2026, 06:00 PM 2 views
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 15న తిరుమల శ్రీవారిని దర్శించుకుని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం తిరుమలలోనే బస చేసి సెప్టెంబర్ 16న పిల్గ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, ఎలక్ట్రిక్ బస్సులు, ఎస్వీ మ్యూజియంను ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 15న తిరుమల శ్రీవారిని దర్శించుకుని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సెప్టెంబర్ 15 నుంచి తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. సెప్టెంబర్ 15న సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో సీఎం చంద్రబాబు బయలుదేరనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చర్ కళాశాల గ్రౌండ్‌కు చేరుకుంటారు. అనంతరం రాత్రి 7.40 గంటలకు శ్రీవారి ఆలయం ఆనంద నిలయం ఎదురుగా ఉన్న బేడీ ఆంజనేయస్వామివారిని దర్శించుకుంటారు. రాత్రి 7:55 గంటల నుంచి 9:15 గంటల వరకు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. తర్వాత తిరుమలలోని శ్రీ గాయత్రి నిలయంలో రాత్రి బస చేస్తారు. సెప్టెంబర్ 16న ఉదయం 8:40 గంటలకు తిరుమల వీక్యూసీ-1లో పిల్గ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సీఎం ప్రారంభించనున్నారు. ఉదయం 9:15 గంటలకు గో గర్భం డ్యామ్ సర్కిల్ వద్ద ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 9:35 గంటలకు తిరుమలలోని ఎస్వీ మ్యూజియంను ప్రారంభించనున్నారు. అదే రోజు ఉదయం 10:25 నుంచి 11:25 గంటల వరకు శ్రీపద్మావతి రెస్ట్ హౌస్‌లో జరిగే పలు సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం 12:25 గంటలకు తిరుపతి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, మధ్యాహ్నం 1:55 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు చేరుకోనున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు రావాలంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్రతో పాటు ఆలయ పండితులు గతంలో ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబును ఆహ్వానించారు.

Related Stories