08 Sep 2026, Tuesday
ఆరోగ్యం

జ్వరాలకు జబర్దస్త్‌ వైద్యం.. లక్షణాలను బట్టి సరైన చికిత్స అవసరం

By PRAJA NADU Desk 08 Sep 2026, 01:04 PM Updated: 08 Sep 2026, 03:14 PM 1 views
ఆహారం, నీటి కాలుష్యం కారణంగా ప్రస్తుతం పలు రకాల జ్వరాలు వ్యాపిస్తున్నాయి. జ్వరాల లక్షణాలు ఒకేలా కనిపించినప్పటికీ, ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి చికిత్స విధానం మారుతుందని వైద్యులు సూచిస్తున్నారు. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్‌, ఇన్‌ఫ్లుయెంజా వంటి జ్వరాల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా సరైన సమయంలో వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. మూడు రోజులకు మించి జ్వరం కొనసాగితే అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
ఆహారం, నీటి కాలుష్యం కారణంగా పలు రకాల జ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వరాల లక్షణాలు చాలా వరకు ఒకేలా కనిపించినప్పటికీ, వ్యక్తిగత లక్షణాలు, ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సరైన చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే జ్వరాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే నీరు, ఆహార కాలుష్యం కారణంగా టైఫాయిడ్‌, కలరా వంటి వ్యాధులు కూడా ప్రభావం చూపుతున్నాయి. వైరస్‌ల ద్వారా వ్యాపించే ఇన్‌ఫ్లుయెంజాలో కూడా సాధారణ ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలసట, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, దగ్గు, గొంతు నొప్పి, ఆకలి తగ్గడం, చలి, ఒణుకు వంటి లక్షణాలు ఫ్లూ సమయంలో కనిపించవచ్చు. జ్వరం మూడు రోజులకు మించి కొనసాగినా, 103 లేదా 104 డిగ్రీలకు తగ్గకపోయినా, వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. పిల్లల్లో జ్వరంతో పాటు వాంతులు, బలహీనత, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ప్రత్యేక శ్రద్ధ అవసరం. మూత్రంలో లేదా చిగుళ్లలో రక్తస్రావం కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్య సహాయం పొందాలని నిపుణులు సూచిస్తున్నారు.

Related Stories