01 Jul 2026, Wednesday
అంతర్జాతీయం

హోర్ముజ్ నిర్వహణపై ఇరాన్-ఒమాన్ కీలక నిర్ణయాలు

By PRAJA NADU Desk 30 Jun 2026, 06:32 AM Updated: 30 Jun 2026, 08:43 PM 6 views
హోర్ముజ్ జలసంధి నిర్వహణపై ఇరాన్‌, ఒమాన్ మధ్య సోమవారం తొలి సంయుక్త కమిటీ సమావేశం జరిగింది. అమెరికాతో కుదిరిన ప్రాథమిక ఒప్పందం తర్వాత జరిగిన ఈ సమావేశంలో భవిష్యత్ నిర్వహణ, నౌకా రవాణా మార్గాలు, సేవల కోసం వసూలు చేసే రుసుములు, సాంకేతిక కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై ఇరు దేశాలు చర్చించాయి. ఏడు నుంచి ఎనిమిది రోజుల్లో నిపుణుల స్థాయి చర్చలు ప్రారంభించి తుది ముసాయిదా సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాద్ి తెలిపారు.
హోర్ముజ్ జలసంధి నిర్వహణపై ఇరాన్‌, ఒమాన్ కీలక చర్చలు ప్రారంభించాయి. అమెరికాతో ప్రాథమిక ఒప్పందం అనంతరం సోమవారం మస్కట్‌లో జరిగిన తొలి సంయుక్త కమిటీ సమావేశంలో భవిష్యత్ నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై ఇరు దేశాలు అభిప్రాయాలు పంచుకున్నాయి. సమావేశంలో జలసంధి పరిపాలన, నౌకా రవాణా మార్గాలు, సేవల కోసం వసూలు చేసే రుసుములు, సాంకేతిక కమిటీల ఏర్పాటు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాద్ి ప్రకారం, ఇరు దేశాలు ఉమ్మడి అవగాహనకు వచ్చాయని, త్వరలో నిపుణుల స్థాయి చర్చలు ప్రారంభమవుతాయని తెలిపారు. హోర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలక మార్గం. గల్ఫ్ ప్రాంతం నుంచి చమురు, సహజ వాయువు రవాణాలో ఈ మార్గం కీలక పాత్ర పోషిస్తోంది. అందువల్ల దీని నిర్వహణపై తీసుకునే నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్యంపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇరాన్ సేవా రుసుముల అంశాన్ని పరిశీలిస్తుండగా, అమెరికా హోర్ముజ్ అంతర్జాతీయ జలమార్గమని పేర్కొంటూ అదనపు రుసుములను వ్యతిరేకిస్తోంది. ఇదే సమయంలో భద్రత, రవాణా, పరిపాలన అంశాలపై ఇరాన్‌, ఒమాన్ మధ్య సాంకేతిక చర్చలు కొనసాగనున్నాయి.

Related Stories