27 Aug 2026, Thursday
విద్య

జేఎన్‌టీయూలో ‘బెస్ట్‌’ శిక్షణకు శ్రీకారం.. రూ.18 కోట్లతో ఆధునిక ల్యాబొరేటరీలు

By PRAJA NADU Desk 27 Aug 2026, 09:47 AM Updated: 27 Aug 2026, 11:12 AM 3 views
ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్‌ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు జేఎన్‌టీయూ హైదరాబాద్‌ కీలక నిర్ణయం తీసుకుంది. బజాజ్‌ ఆటో ఫౌండేషన్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని సుమారు రూ.18 కోట్లతో ఆధునిక ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయనుంది. మొదటి దశలో మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు రోబోటిక్స్‌, ఆటోమేషన్‌, ఎలక్ట్రిక్‌ మొబిలిటీపై శిక్షణ ఇవ్వనున్నారు
హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఆధునిక నైపుణ్య శిక్షణ అందించేందుకు కీలక చర్యలు చేపట్టింది. మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ వంటి కోర్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌, ఇండస్ట్రీ స్కిల్స్‌ పెంపొందించడమే లక్ష్యంగా బజాజ్‌ ఆటో ఫౌండేషన్‌తో జేఎన్‌టీయూ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. బజాజ్‌ ఆటో ఫౌండేషన్‌ తన కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.18 కోట్ల విలువైన ఆధునిక ల్యాబొరేటరీలను జేఎన్‌టీయూలో ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందుకోసం వర్సిటీ ప్రాంగణంలో బజాజ్‌ ఇంజనీరింగ్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ (BEST) కేంద్రాల ఏర్పాటుకు పనులు కొనసాగుతున్నాయి. మొదటి దశలో మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థుల కోసం కేంద్రాలను డిసెంబరు నాటికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి దశలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌, రోబోటిక్స్‌, ఆటోమేషన్‌ అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఎలక్ట్రిక్‌ మొబిలిటీపై ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఈ అంశాలను బీటెక్‌ పాఠ్యప్రణాళికతో అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులకు చదువుతోపాటు పరిశ్రమకు అవసరమైన ప్రాక్టికల్‌ నైపుణ్యాలు అందేలా ప్రణాళిక రూపొందించారు. సుమారు 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పలు పరికరాల ప్రయోగశాలలు, కంప్యూటర్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. రోబోటిక్స్‌, ఆటోమేషన్‌ కేంద్రంలో మెకట్రానిక్స్‌, మోషన్‌ కంట్రోల్‌, సెన్సార్‌ టెక్నాలజీ, రోబోటిక్స్‌, ఆటోమేషన్‌ వంటి అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తం శిక్షణలో వందల గంటల ప్రాక్టికల్‌ లెర్నింగ్‌తో పాటు ప్రాజెక్ట్‌ వర్క్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ కేంద్రాల ద్వారా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యక్ష అవగాహన లభించడంతో పాటు ఉద్యోగ అవకాశాలకు అవసరమైన పరిశ్రమ నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశం ఏర్పడనుంది.

Related Stories