ప్రవాస కుటుంబాలకు భరోసా.. గ్రామస్థాయికి చేరుతున్న APNRTS సేవలు
ప్రవాసాంధ్ర భరోసా భీమా (PBB) పథకంపై రైల్వే కోడూరు మండలం గంగరాజుపురంలో APNRTS ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రవాసాంధ్రుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. విదేశాల్లో పనిచేస్తున్న ప్రతి ప్రవాస కుటుంబానికి భద్రత, ఆర్థిక రక్షణ అందించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని వివరించారు. కార్యక్రమంలో APNRTS డైరెక్టర్ (అవేర్నెస్ & సర్వీసెస్) నాగేంద్ర బాబు ఆకిశెట్టి, NRI నాయకులు కత్రా రమేష్, దాడిశెట్టి సుబ్బరాజు పాల్గొన్నారు.
ప్రవాసాంధ్రుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో APNRTS ఆధ్వర్యంలో ప్రవాసాంధ్ర భరోసా భీమా (PBB) పథకంపై గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో రైల్వే కోడూరు మండలం గంగరాజుపురంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు విదేశాల్లో పనిచేస్తున్న ప్రవాసాంధ్రులకు భద్రత, ఆర్థిక రక్షణ కల్పించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
APNRTS డైరెక్టర్ డా. రివకుమార్ వేమూరి మార్గదర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని APNRTS డైరెక్టర్ (అవేర్నెస్ & సర్వీసెస్) నాగేంద్ర బాబు ఆకిశెట్టి తెలిపారు. ప్రతి గ్రామంలోని ప్రతి ప్రవాస కుటుంబానికి ఈ పథకం ప్రయోజనాలు చేరేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని పేరూరు గ్రామపంచాయతీ, గంగరాజుపురం ప్రవాసాంధ్రులు సంయుక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో NRI నాయకులు కత్రా రమేష్, దాడిశెట్టి సుబ్బరాజు పాల్గొని పథకంపై వివరాలు తెలియజేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ప్రవాస కుటుంబానికి చేరవేసేందుకు APNRTS నిరంతరం కృషి చేస్తోందని అధికారులు తెలిపారు.





