కువైట్ నుంచి కాంతి కిరణ్కు APNRTS సురక్షిత రాక
కువైట్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన కాంతి కిరణ్ను స్వదేశానికి తీసుకురావడంలో APNRTS కీలక పాత్ర పోషించింది. మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు APNRTS అధ్యక్షుడు డాక్టర్ వేమూరు రవికుమార్ చొరవతో అధికారులు వెంటనే స్పందించారు. డైరెక్టర్ అక్కిలి నాగేంద్ర బాబు కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించి, కువైట్లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తూ అవసరమైన పత్రాలు, ప్రయాణ అనుమతులు పూర్తి చేయించారు. సమిష్టి కృషితో కాంతి కిరణ్ సురక్షితంగా భారతదేశానికి చేరుకున్నారు.
కువైట్లో వివిధ కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన శ్రీ కె. కాంతి కిరణ్ స్వదేశానికి తిరిగి రావడానికి APNRTS సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టింది. గౌరవ మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు APNRTS అధ్యక్షుడు డాక్టర్ వేమూరు రవికుమార్ వెంటనే స్పందించి అధికారులను అప్రమత్తం చేశారు.
APNRTS డైరెక్టర్ (ఆపరేషన్స్ & సర్వీసెస్) అక్కిలి నాగేంద్ర బాబు కుటుంబ సభ్యులతో మాట్లాడి పూర్తి వివరాలను సేకరించారు. అనంతరం కువైట్లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో నిరంతర సమన్వయం కొనసాగిస్తూ ప్రయాణానికి అవసరమైన పత్రాలు, అనుమతులు మరియు ఇతర అధికారిక ప్రక్రియలను వేగంగా పూర్తి చేయించారు.
అన్ని ప్రక్రియలు పూర్తికావడంతో కాంతి కిరణ్ సురక్షితంగా భారతదేశానికి చేరుకున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో APNRTS, భారత రాయబార కార్యాలయం, కుటుంబ సభ్యుల సమన్వయం కీలకంగా నిలిచింది.
ప్రవాసాంధ్రులు విదేశాల్లో ఎదుర్కొనే అత్యవసర పరిస్థితుల్లో వారికి అండగా నిలవడం, అవసరమైన సహాయం అందించడం, స్వదేశానికి సురక్షితంగా చేర్చడం వంటి సేవలను APNRTS నిరంతరం కొనసాగిస్తోంది. ఈ ఘటన కూడా సంస్థ సేవా దృక్పథానికి మరో ఉదాహరణగా నిలిచింది.





